Posted on 2025-07-26 16:18:01
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఓఎస్డి గోపతి నరేందర్ సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ను అకస్మాత్తుగా సందర్శించారు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను, స్టేషన్ యొక్క సెక్యూరిటీ విధానంను చెక్ చేసి పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. స్టేషన్ సిబ్బంది అందరూ ఎప్పటికప్పుడు నక్సలైట్ల విధివిధానాలపై అవగాహన కలిగి ఉండి సమాచారం సేకరించాలని, విధి నిర్వహణలో అలర్ట్ గా ఉండాలని స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని , రాబోవు ఎలక్షన్లకు సంబంధించి గ్రామాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ రాయలవెంకటేశ్వర్లు, సుజాతనగర్ మాలోత్ రమాదేవి, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >