Posted on 2025-07-25 19:53:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సమాజంలో ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పట్ల జర్నలిజం వృత్తిలో వాటిని పరిష్కరించే బాధ్యత వృత్తి గల జర్నలిస్టులు ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న ఒకరి కి రక్తదానం చేసి మానవత్వాన్ని నిరూపించుకున్నారు నిజామాబాద్ కు చెందిన జర్నలిస్టులు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాదు నగరంలోని గాయత్రి నగర్ లో ఉన్న అఖిలేష్ అనే అబ్బాయికి డెంగ్యూ వ్యాధి సోకడంతో శరీరంలోని రక్త కణాలు 15000 మాత్రమే ఉందని డాక్టర్ తెలియజేశారు . అత్యవసరంగా రెండు డిబిఆర్ అనే రక్తకణాలు శరీరంలో ఎక్కించడం వల్ల ప్రాణాపాయం ఉండదని డాక్టర్ సూచించారు . దీంతో నిజామాబాదు పట్టణానికి చెందిన జర్నలిస్టులు ప్రాణదాతలుగా ముందుకు వచ్చారు . ఐ న్యూస్ రిపోర్టర్ రవితేజ రెడ్డి, మహా న్యూస్ ఛానల్ కెమెరామెన్ గణేష్ లు రక్తదానం చేసి ఆ బాలుణ్ణి ప్రాణాపాయం నుండి కాపాడటంలో ప్రాణదాతలు నిలిచినందుకు వారికి పలువురు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి అభినందించారు .
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >