Posted on 2026-07-23 13:29:02
డైలీ భారత్, యాదాద్రి భువనగిరి:యాదగిరిగుట్టను ప్లాస్టిక్ రహిత పుణ్యక్షేత్రంగా మార్చాలని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, మాజీ బ్రాహ్మణ సేవా వాహిని (BSV) యాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజుల పత్తిపాటి కోరారు.
ఆమె విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి దేవాలయ పరిరక్షణ ప్రతి భక్తుడి బాధ్యత అని అన్నారు. "మనం స్వామిని దర్శించుకోవడంతో పాటు కొండను కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లను యాద్రి కొండపైకి తీసుకురాకూడదు. బదులుగా పునర్వినియోగ సంచులను వాడి, శుభ్రమైన యాదాద్రిని భావితరాలకు అందిద్దాం" అని పిలుపునిచ్చారు.
"దేవాలయ పరిరక్షణే పరమ పూజ" అని ఆమె అన్నారు. తిరుమల కొండపై అమలు చేస్తున్న విధంగా యాదాద్రి కొండపై కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని వెంటనే విధించాలని దేవస్థాన కమిటీని కోరారు.
భక్తులు ఈ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించి, యాద్రిని మరింత పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచాలని మంజుల పత్తిపాటి విజ్ఞప్తి చేశారు.
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >
చావుకు మోదీ కారణం... ఇట్లు భారత దేశ పౌరుడు అంటూ సూసైడ్ నోట్...
Posted On 2026-07-23 08:40:10
Readmore >
చీర కొనలేదని భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో బాది, ఆపై గొంతు నులిమి చంపిన భార్య
Posted On 2026-07-23 08:08:04
Readmore >