Posted on 2026-09-09 14:45:53
డైలీ భారత్, కోదాడ: కోదాడ పట్టణాన్ని వణికిస్తున్న వరుస ఇళ్ల దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. 10 లాక్డ్ హౌస్ దొంగతనాలకు పాల్పడిన సీరియల్ దొంగను అరెస్ట్ చేసి రూ.60 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.
నిందితుడు:
పట్నం శెట్టి రాజు @ రాజీ రెడ్డి (41), కారు డ్రైవర్, పాపిరెడ్డి నగర్ కాలనీ, జగద్గిరిగుట్ట, హైదరాబాద్.
దొంగతనం చేసే విధానం:
నిందితుడు హైదరాబాద్ నుండి కోదాడకు ప్రయాణికులను తీసుకువచ్చి రాత్రి ఇక్కడే ఉండిపోయేవాడు. తన Honda Amaze కారు (అసలు నంబర్ AP 28 BY 7770) కు నకిలీ నంబర్ ప్లేట్ TS 07 GC 1612 పెట్టి నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసేవాడు. తెల్లవారుజామున తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, చేతులకు గ్లౌజులకు బదులు షూ సాక్స్ వేసుకుని స్క్రూడ్రైవర్లతో తాళాలు పగలగొట్టి చోరీ చేసేవాడు.
2021 నుండి ఇప్పటివరకు కోదాడలో 10 దొంగతనాలు చేయగా, అందులో 2026లోనే 7 చోరీలు చేశాడు. ఇతనిపై గతంలో 2009లో ఖమ్మంలో సైకిల్ దొంగతనం, 2015-16లో జగద్గిరిగుట్టలో 5 ఇళ్ల దొంగతనం కేసులు ఉన్నాయి.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
37.2 తులాల బంగారు ఆభరణాలు (విలువ సుమారు రూ.60 లక్షలు)
470 గ్రాముల వెండి
రూ. 3.60 లక్షల నగదు
నేరానికి ఉపయోగించిన Honda Amaze కారు, VIVO మొబైల్ ఫోన్
ఎలా దొరికాడు?
ఈరోజు ఉదయం 8 గంటలకు దొంగిలించిన సొత్తును విజయవాడలో అమ్మేందుకు వెళ్తుండగా కోదాడ ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి వెనక్కి తప్పించుకోబోయి పట్టుబడ్డాడు. కారు డిక్కీ తనిఖీ చేయగా బంగారం, వెండి, నగదు బయటపడ్డాయి.
నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.
ఈ కేసును ఛేదించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
ప్రజలు ఇళ్లకు తాళం వేసి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >