Posted on 2025-07-23 20:56:59
డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: డిసిసిబి సిబ్బంది సమర్థవంతంగా, సక్రమంగా విధులు వినియోగించుకుంటూ, మరింత సమర్థవంతంగా పని చేసి బ్యాంకు అభివృద్ధి కి దోహదపడాలని డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి సూచించారు. బ్యాంకు ప్రధాన కార్యాలయం లో నూతనంగా నిర్మించిన రెండవ అంతస్తు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించి, రెండవ అంతస్తు భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు నిధులతో సుమారు కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో సకల ఆధునిక వసతులతో కూడిన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. నూతన వసతులు సిబ్బంది ఉత్పాదకతను పెంచేలా, మరింత సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని కల్పిస్థాయి అని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే, జిల్లా సహకార అధికారి శ్రీనివాస రావు, టీజీసీఏబీ జనరల్ మేనేజర్ సురేఖ, ఉన్నతాధికారులు, శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >