Posted on 2025-07-23 17:26:59
డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: డిసిసిబి సిబ్బంది సమర్థవంతంగా, సక్రమంగా విధులు వినియోగించుకుంటూ, మరింత సమర్థవంతంగా పని చేసి బ్యాంకు అభివృద్ధి కి దోహదపడాలని డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి సూచించారు. బ్యాంకు ప్రధాన కార్యాలయం లో నూతనంగా నిర్మించిన రెండవ అంతస్తు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని పాలకవర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించి, రెండవ అంతస్తు భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు నిధులతో సుమారు కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో సకల ఆధునిక వసతులతో కూడిన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. నూతన వసతులు సిబ్బంది ఉత్పాదకతను పెంచేలా, మరింత సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని కల్పిస్థాయి అని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే, జిల్లా సహకార అధికారి శ్రీనివాస రావు, టీజీసీఏబీ జనరల్ మేనేజర్ సురేఖ, ఉన్నతాధికారులు, శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!
Posted On 2026-07-22 19:43:08
Readmore >
బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్
Posted On 2026-07-22 19:03:39
Readmore >
హైదరాబాద్లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >
వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-07-22 15:05:39
Readmore >
రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-07-22 15:03:11
Readmore >
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >