Posted on 2026-07-22 12:40:48
ప్రచురణార్థం
తేది. 22-07-2026
కార్మికుల మనోవికాస సదస్సులో సైకాలజిస్ట్ పున్నంచందర్ పిలుపు
డైలీ భారత్, సిరిసిల్ల: కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ అన్నారు.
మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల గణేష్ నగర్లో కార్మికులకు మనోవికాస సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మాట్లాడుతూ.. కార్మికులు కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి కారణంగా తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపడం లేదన్నారు.
ప్రస్తుతం అనేక మంది కార్మికులు జీవనశైలి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు.
శారీరకంగా కష్టపడి పనిచేసే కార్మికులు కూడా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
కార్మికులు క్రమం తప్పకుండా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని, సమతుల్య ఆహారం తీసుకోవాలని, ఉప్పు మరియు చక్కెర వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పొగాకు, గుట్కా, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు.
అలాగే ప్రతిరోజూ తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడంతో పాటు, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, శ్వాసాభ్యాసాలు, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుపుతూ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే వారు తమ కుటుంబాలను సంతోషంగా చూసుకోవడంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కాగలరు పున్నంచందర్ అన్నారు.
మానసిక సమస్యలు ఎదురైనప్పుడు మనోవికాస కేంద్రాన్ని సంప్రదించి సరైన చికిత్స, కౌన్సెలింగ్ పొందాలని కార్మికులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది, బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత మరియు కార్మికులు పాల్గొన్నారు.
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >