Posted on 2026-07-22 15:14:56
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ, గ్రామస్తులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
డైలీ భారత్, చర్ల: "విద్యే భవిష్యత్తుకు పునాది" అనే నినాదంతో చర్ల మండలం బక్కచింతలపాడు గ్రామంలో నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రారంభించారు.
పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు కొత్త స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. చదువుతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యం చాలా ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఎస్పీ, వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి వివరించారు. దోమల వ్యాధులు, కలుషిత నీరు తాగకుండా ఉండాలని సలహా ఇచ్చారు.
అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపవద్దని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గ్రామస్తులు ఎస్పీ చొరవను అభినందించారు.
#Chintalapadu #CharlaMandal #Education #RoadSafety #TelanganaPolice
హైదరాబాద్లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >
వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-07-22 15:05:39
Readmore >
రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-07-22 15:03:11
Readmore >
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >