Posted on 2026-07-22 14:57:43
బీ ఆర్ ఎస్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ దాదన్న గారి మధుసూదన్ రావు
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: దేశ రాజదాని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీలతో, టియర్ గ్యాస్ లతో దాడులు చేయించడం అత్యంత అప్రజాస్వామికని చర్యలని భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలోని అత్యున్నతస్థాయిలో నిర్వహించే పరీక్షలలో లీకేజీలను అరికట్టలేని అధికారులు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ బాధ్యతలను మరిచిపోయి అప్రధానంగా ఉండటమే వింతల్లోకెళ్ళ వింత అని మధుసుధన్ ఏద్దెవ చేశారు. ప్రశ్నించే హక్కులు రాజ్యాంగం కల్పించిందని ఆ హక్కులను అణచివేయలేరని పేర్కొన్నారు. విద్యార్థులపై లాఠీచార్జీలను, టియర్ గ్యాస్ లను ప్రయోగించడం ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యావ్యవస్థలో లీకేజీలు లేని, పారదర్శక పరీక్షల విధానాన్నే విద్యార్థులు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. వ్యవస్థలో జవాబుదారితనం కోసం కొట్లాడుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు
హైదరాబాద్లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >
వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-07-22 15:05:39
Readmore >
రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-07-22 15:03:11
Readmore >
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >