Posted on 2025-07-23 16:59:49
భయాందోళలకు గురవుతున్న స్థానికులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని 18వ డివిజన్ ముబారక్ నగర్ శివారులో గల సుక్జిత్ ఫ్యాక్టరీలో నుండి తరచుగా విష సర్పాలు ముబారక్ నగర్ లోకి చొరబడుతున్నాయి. అందులో ఉండే విశ్వసర్పాలు ఆహారం దొరకక బయటకి వచ్చి ముబారక్ నగర్ లోని ఆయా ఇండ్లలోకి చొరబడి ప్రజలకు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీల మక్క దినుసులు నుండి దాదాపు 20 రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తుంటారు. అయితే ఇందులో నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు తినడానికి అలవాటు పడిన విష సర్పాలు తరచుగా ఫ్యాక్టరీలో ఏదో ఒకచోట పాములు దర్శనం ఇస్తాయి. అందులో సరైన ఆహారం దొరకక అవి బయటకి వచ్చి ఆ ప్రాంతంలోని ఇండ్లలోకి చొరబడి ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి ఆరడుగుల భారీ కొండచిలువ ఫ్యాక్టరీలో నుండి కర్రలు రాళ్లతో బాది చంపేశారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీలో ఉన్న వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తీసివేసి పాముల బెదడ నుండి ముబారక్ నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >