| Daily భారత్
Logo




ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు - ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు

News

Posted on 2025-07-23 11:49:23

Share: Share


ఆర్మూర్ మీదుగా  పటాన్ చెరు - ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు

ఎంపీ అర్వింద్ కి లేఖ ద్వారా తెలియజేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:నిజామాబాద్ లో రైల్వే సౌకర్యాలు విస్తరణకు సంబంధించి  మరో ప్రాజెక్ట్ కి ముందడుగు పడింది. గత రెండేళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు - ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ  ప్రాజెక్టు మంజూరు అయ్యిందని రైల్వే మంత్రి, ఎంపీ అర్వింద్ కి లేఖ రాసారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి   డీపీఆర్ తయారు చేస్తున్నారని, డీపీఆర్ పూర్తయిన తర్వాత  తదుపరి చర్యలు చేపడతామని మంత్రి లేఖలో పేర్కొన్నారు. కాగా తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అర్వింద్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.


Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >