Posted on 2026-07-21 13:45:51
డైలీ భారత్, న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET UG) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం మంగళవారం ఢిల్లీలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.సోమవారం పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీచార్జీ, దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశాయి
ఈ క్రమంలో లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకుల నేతృత్వంలో పార్లమెంట్ సభ్యులు ప్రధాని అధికారిక నివాసాన్ని ముట్టడించారు
మంగళవారం మధ్యాహ్నం రాజాజీ మార్గ్లోని కాంగ్రెస్ అధ్యక్షుల నివాసం వద్దకు చేరుకున్న శ్రేణులు, అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసం వైపు పాదయాత్రగా దూసుకెళ్లారు. భద్రతా వలయాలను ఛేదించి ప్రధాని ఇంటి ముందుకు చేరుకున్న ప్రతిపక్ష అగ్రనేతలు రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హఠాత్పరిణామానికి గురైన ఢిల్లీ పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి నిరసనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు
ఈ అంశంపై తక్షణ చర్చకు పట్టుబడుతూ ఉభయ సభల్లోనూ స్లోగన్లు ఇస్తూ నిరసన తెలపడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ పూర్తిగా స్తంభించిపోయి, సభలు వాయిదా పడ్డాయి
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ
Posted On 2026-07-21 12:52:04
Readmore >
సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
Posted On 2026-07-21 06:12:30
Readmore >