Posted on 2026-07-21 12:52:04
కాలనీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి
డైలీ భారత్, ఉప్పల్: వెంకట సాయి నగర్ కాలనీలో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లను తక్షణమే మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ కాలనీ అధ్యక్షుడు, ఏ. విజయేందర్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విజయేందర్ రెడ్డి కాలనీలోని పలు అంతర్గత వీధులు ఇప్పటికీ మట్టి రోడ్లుగానే ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా బురదమయంగా మారి చిన్నారులు, వృద్ధులు, మహిళలు నిత్యావసర పనుల కోసం బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, ఇతర సేవా వాహనాలు కాలనీలోకి సులభంగా చేరుకోలేని పరిస్థితి నెలకొన్నదని వివరించారు.
అదేవిధంగా రోడ్లు సరిగా లేకపోవడంతో దుమ్ము, బురద కారణంగా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కాలనీలో నివసిస్తున్న వందలాది కుటుంబాలు సంవత్సరాలుగా సీసీ రోడ్ల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సమస్యను సానుకూలంగా పరిశీలించి వెంటనే స్పందించారు. కాలనీలో సీసీ రోడ్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వేగవంతం చేయాలని కోరుతూ సంబంధిత జోనల్ కమిషనర్కు వాట్సాప్ ద్వారా తన సిఫారసు లేఖను పంపించారు. కాలనీ మొత్తం రోడ్లకు సమగ్ర ఎస్టిమేషన్ను త్వరితగతిన పూర్తి చేసి, పరిపాలనా అనుమతులు మంజూరు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే పేర్కొంటూ, కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సీసీ రోడ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేలా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు గంధం నాగేశ్వరరావు , ఎండి జాంగిర్ , కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >