Posted on 2026-07-21 12:52:04
కాలనీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి
డైలీ భారత్, ఉప్పల్: వెంకట సాయి నగర్ కాలనీలో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లను తక్షణమే మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ కాలనీ అధ్యక్షుడు, ఏ. విజయేందర్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విజయేందర్ రెడ్డి కాలనీలోని పలు అంతర్గత వీధులు ఇప్పటికీ మట్టి రోడ్లుగానే ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా బురదమయంగా మారి చిన్నారులు, వృద్ధులు, మహిళలు నిత్యావసర పనుల కోసం బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, ఇతర సేవా వాహనాలు కాలనీలోకి సులభంగా చేరుకోలేని పరిస్థితి నెలకొన్నదని వివరించారు.
అదేవిధంగా రోడ్లు సరిగా లేకపోవడంతో దుమ్ము, బురద కారణంగా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కాలనీలో నివసిస్తున్న వందలాది కుటుంబాలు సంవత్సరాలుగా సీసీ రోడ్ల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సమస్యను సానుకూలంగా పరిశీలించి వెంటనే స్పందించారు. కాలనీలో సీసీ రోడ్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వేగవంతం చేయాలని కోరుతూ సంబంధిత జోనల్ కమిషనర్కు వాట్సాప్ ద్వారా తన సిఫారసు లేఖను పంపించారు. కాలనీ మొత్తం రోడ్లకు సమగ్ర ఎస్టిమేషన్ను త్వరితగతిన పూర్తి చేసి, పరిపాలనా అనుమతులు మంజూరు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే పేర్కొంటూ, కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సీసీ రోడ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేలా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు గంధం నాగేశ్వరరావు , ఎండి జాంగిర్ , కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ
Posted On 2026-07-21 12:52:04
Readmore >
సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
Posted On 2026-07-21 06:12:30
Readmore >