Posted on 2026-07-21 07:46:47
రాష్ట్ర ఆరోగ్య శాఖ పనితీరును మెచ్చిన కేంద్ర ప్రభుత్వం
మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణ మరో జాతీయ విజయాన్ని నమోదు చేసింది
డైలీ భారత్ డెస్క్: మాతా-శిశు ఆరోగ్య సేవల బలోపేతానికి మా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.200 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులను మంజూరు చేయడం ఎంతో సంతోషకరం. ఇది రాష్ట్ర ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సమిష్టి కృషికి లభించిన గౌరవం. మా ప్రభుత్వ లక్ష్యం ప్రతి గర్భిణికి, ప్రతి తల్లికి, ప్రతి నవజాత శిశువుకు అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించడం. ఈ ప్రోత్సాహక నిధులు మాతృ మరణాలు, నవజాత శిశు మరణాలను మరింత తగ్గించడంలో, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన మాతా-శిశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి.తెలంగాణను దేశంలో మాతా-శిశు ఆరోగ్య సేవల్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మా ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా పనిచేస్తూ, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తుంది.
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ
Posted On 2026-07-21 12:52:04
Readmore >
సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
Posted On 2026-07-21 06:12:30
Readmore >
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Posted On 2026-07-21 04:16:53
Readmore >
తరగతులకు రోజూ హాజరుకావాలి.. ప్రణాళిక ప్రకారం చదవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-20 17:26:49
Readmore >
శబరిమల బంగారు దోపిడీ కేసులో తుది నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలి...
Posted On 2026-07-20 16:40:30
Readmore >
బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు... ప్రజల భద్రతే లక్ష్యంగా బాన్సువాడ పోలీసులు
Posted On 2026-07-20 16:14:17
Readmore >