Posted on 2026-07-21 14:56:26
పోలీసు-ప్రాసిక్యూషన్ సమన్వయంతో పోక్సో కేసులో 10 ఏళ్ల జైలు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. 1098 హెల్ప్ లైన్ ద్వారా వెలుగులోకి వచ్చిన కేసులో కోర్టు కీలక తీర్పు.
పోలీసు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతోనే నేరస్తులకు శిక్షలు పడతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పోక్సో కోర్టు తీర్పు మరోసారి రుజువు చేసింది.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన సిరిసిల్ల బి.వై నగర్ కు చెందిన వేముల శ్రీనివాస్ కు కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించారు.
చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం రావడంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి టౌన్ ఎస్.ఐ శ్రీకాంత్ దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు.
అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు బృందం 8 మంది సాక్షులను కోర్టు ముందుంచింది. ప్రాసిక్యూటర్ రజినీకాంత్ సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో శాస్త్రీయ ఆధారాల ఆధారంగా నేరం రుజువైంది.
ఈ కేసులో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు. "మైనర్లపై నేరాలకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించం. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.
#Sircilla #POCSO #TelanganaPolice #ChildSafety #1098 #CourtVerdict
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >