Posted on 2025-07-23 07:22:44
ఆసుపత్రిలో ఉన్న ఓ లిఫ్టు ఒక్కసారిగా ఆగిపోవడంతో అందులో ఉన్న రోగులు, వారి బంధువులు ఆందోళన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సమస్యలు, సరిగా లేక ఇక్కడికి వైద్యం కోసం వచ్చిన వారు నానా నరకయాతన పడుతున్నారు. వైద్యం సంగతి అటు ఉంచితే ఆసుపత్రిలో ఉన్న లిఫ్టులు ఎప్పుడు పనిచేస్తాయో ఎప్పుడు పనిచేయవో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సుమారు అరగంట పాటు రోగులు వారి బంధువులు లిఫ్టు ఒక్కసారి ఆగిపోవడంతో ఆ లిఫ్టు డోరు తెరుచుకోకపోవడంతో గాల్లో ఊపిరి పోయినట్టుగా రోగులు వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పైవార్డులో నుంచి రోగులు మరియు వారి సహచరులు లిఫ్ట్ కిందకు వెళ్తున్న సమయంలో, ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోయి డోర్ తెరుచుకోలేదు అందులో ఇరుక్కుపోయిన వారు అరగంట పాటు గాల్లో ఊపిరి తీసుకునే పరిస్థితి లేక బిక్కుబిక్కుమన్నారు. సమాచారం అందుకున్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చి, వారు వెంటనే అక్కడకు చేరుకొని లిఫ్ట్ డోర్ను తెరిచి రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటనపై రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి లిఫ్ట్ల పరిస్థితిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకున్న పరిస్థితి ఉండేది. లిఫ్ట్ ల మెంటైనెన్స్ కోసం నెల నెల ప్రభుత్వం నుండి డబ్బులు మంజూరు అవుతున్నప్పటికీ వాటిని మెంటేనెన్స్ చేయడంలో ఆసుపత్రి అధికారులు విఫలమైతున్నారు. ఒకవేళ అత్యవసర ప్రమాద బాధితులు ఎవరైనా చికిత్స కోసం లిఫ్టులో పోతే ఇలా అర్ధాంతరంగా ఒక్కసారిగా ఆగిపోవడంతో వారి ప్రాణాలు లిఫ్టులోనే గాల్లో కలిసిపోవాల్సిందేనా అని, దీనికి బాధ్యులు ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >