Posted on 2025-07-22 18:56:16
చాకచక్యంగా వ్యవహరించి దారుణ ఘాటుకాన్ని అడ్డుకున్న పోలీసులు
నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ కు పంపిన పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి పట్టణ పోలీసులు బాలిక కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలో చెదించి సవతి తండ్రి చేతిలో చిన్నారి హత్యకు గురికాకుండా కాపాడారు. మంగళవారం ఉదయం జరిగిన చిన్నారి బాలిక కిడ్నాప్ ను సాయంత్రం లొపు చెదించి కాపాడినట్లు పట్టణ సిఐ నరహరి తెలిపారు... మంగళవారం పట్టణ సిఐ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు... కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ ఎరియాలో పుట్ పాత్ లో నివసించే జంగం మమత అనే మహిళ సోమవారం రాత్రి తన కుతురు కీర్తిక(2) తో ఆశోక్ నగర్ లో రాయల్ చికెన్ వద్ద పుట్ పాత్ పై నిధించింది. మంగళవారం ఉదయం లేచేసరికి కుతురు లేకపోవడంతో స్థానికంగా విచారించగా గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకేళ్లడని తెలుపడంతో పొలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర, అధనపు ఎస్పీ చైతన్య రెడ్డి అదేశాలతో పట్టణ సిఐ నరహరి అధ్వర్యంలో పలు టీంలను ఎర్పాటు చేసి గాలింపు చర్యలు చెపట్టారు. సాయంత్రం మున్సిపల్ ఆపీస్ వద్ద ఒక వ్యక్తి, చిన్నారితో వైన్స్ వద్ద ఉండగా పోలీసులు పట్టుకుని విచారించడంతో బాలిక కిడ్నాప్ వ్యవహరం బట్టబయలైంది.
సాయంత్రం మున్సిపల్ అపిస్ వద్ద ఒక వ్యక్తి, చిన్నారితో వైన్స్ వద్ద ఉండగా పోలీసులు పట్టుకుని విచారించడంతో బాలిక కిడ్నాప్ వ్యవహరం బట్టబయలైంది. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన పిల్లి రాజుకు ఇదివరకు వివాహం జరిగిన భార్య వదిలి వేల్లడంతో ఆశోక్ నగర్ కల్లుబట్టిలో పనిచేస్తున్న సమయంలో పరిచయం అయిన జంగం మమతను రెండు నెలల క్రితం గుడిలో పెళ్లి చేసుకున్నాడు. జంగం మమతకు అప్పటికి మొదటి భర్త ద్వార కిర్తీక(2) అనే కుతురు ఉండగా ముగ్గురు కలిసి జీవిస్తున్నారు. ఇటివల మమత మరో వ్యక్తితో కలువడంతో రాజుకు ఆమేకు మద్య గోడవలు జరగి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. తనను కాదని వేరేవాడితో తిరుగుతున్న మమతను భాదపెట్టాలని అందుకు కుతురును కిడ్నాప్ చేసి హత్య చేయాలని రాజు నిర్ణయించాడు. రెండు రోజులుగా మమతను వెంబడిస్తు మంగళవారం ఉదయం కీర్తికను నిధ్రలోనుంచి ఎత్తుకేళ్లాడు. దేవును పల్లి పోదలలో కీర్తికను చంపాలనుకుని దైర్యం కోసం క్వార్టర్ మద్యం సేవిస్తే ఇజీగా చంపొంచ్చు అని వైన్స్ వద్ద రాజును పోలీసులు రెడ్ హ్యండేడ్ పట్టుకున్నారు. పోలిస్ స్టేషన్ లో విచారించగా రాజు తన ప్లాన్ గురించి తెలుపగా అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ
Posted On 2026-07-21 12:52:04
Readmore >