Posted on 2025-07-08 12:57:22
డైలీ భారత్, లింగాలఘనపురం: మద్యానికి బానిసగా మారి భార్యలను వేధిస్తుండడంతో భర్తను గొడ్డలి ఇద్దరు భార్యలు నరికి చంపారు. ఈ సంఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఏనబావి గ్రామ శివారులో పిట్లోనిగూడెంలో కాల్వ కనకయ్య(30) ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్నాడు. కనకయ్య మద్యానికి బానిసగా మారాడు. మే నెలలో మద్యం మత్తులో అక్కను కనకయ్య హత్య చేసి పారిపోయాడు.
అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ భార్యలతో పాటు గ్రామస్థులను బెదిరించేవాడు. అతడి ఆగడాలకు ఎక్కువ కావడంతో భార్యలు విసిగిపోయారు. సోమవారం రాత్రి ఇంటికి చేరుకొని భార్యలను చంపేస్తానని గొడ్డలి పట్టుకొని తిరిగాడు. దీంతో భార్యలు ఎదురుతిరిగి గొడ్డలి తీసుకొని అతడిని నరికేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >