Posted on 2025-07-05 23:13:17
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న రేషన్ బియ్యాన్ని, సుజాతనగర్ మండలం, చింతలతండా గ్రామానికి చెందిన మాలోతు వినోద్ కుమార్, తండ్రి పేరు లచ్చు అను అతను జూలూరుపాడు మండల పరిసర ప్రాంత గ్రామాలలో లబ్ధిదారుల వద్ద నుండి, తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, అట్టి బియ్యాన్ని ఎక్కువ రేటుకు అమ్ముకునేందుకు, తన యొక్క బజాజ్ అప్పి ట్రాలీలో గుండ్ల రేవు గ్రామం నుండి సుజాతనగర్ వైపు తీసుకుని వెళుచుండగా, మార్గమధ్యలో బేతాళపాడు గ్రామం వద్దకు చేరుకునేసరికి, ఈరోజు ఉదయం 5 గంటలకు జూలూరుపాడు ఎస్సై రవి, బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాలీను ఆపి, తనిఖీ చేయగా అందులో సుమారు 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నది. అక్రమంగా రేషన్ బియ్యం తోలకాలు చేస్తున్న వినోద్ కుమార్ ని అదుపులోకి తీసుకొని, 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మరియు బజాజ్ ట్రాలీని స్వాధీనపరచుకోనైనది. రేషన్ బియ్యం యొక్క విలువ సుమారు 11000 రూపాయల వరకు ఉంటుంది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >