| Daily భారత్
Logo




"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

Devotional

Posted on 2026-04-18 13:51:32

Share: Share


"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

డైలీ భారత్, సింహాచలం: నరసింహ స్వామి ఉగ్ర మూర్తి భయం కొలిపేలా ఉంటాడు. కానీ సింహాచలం అప్పన్న స్వామి లో ఉగ్రత్వం ఏమాత్రం ఉండదు నిరంతరం చందనపు పూత లో దర్శనమిస్తాడు.

స్వామి. ఏడాదికోమారు అక్షయ తృతీయనాడు చందనం పూతను తొలగించి చూస్తే గరుత్మంతుని లాలిస్తూ భక్త రక్షణ కోసం తాపత్రయ పడుతూ కనిపిస్తాడు అప్పన్న స్వామి.

స్వామి వారి చందనోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం..

చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని భక్తులపై చల్లని చూపులు చేసే దేవాదిదేవుడు సింహాచలం అప్పన్న స్వామీ.

చందనపు పూత లో స్వామి సుమారు మూడు అడుగుల ఎత్తుతో శివలింగం మాదిరిగా గుండ్రంగా దర్శనమిస్తాడు.

 వాస్తవానికి స్వామికి రూపం ఉన్న ఆరూపం అంత చందనంతో కప్పబడి ఉంటుంది సంవత్సరంలో ఒక్కరోజు అంటే అక్షయ తృతీయ రోజు మినహా మిగతా అన్ని రోజులు స్వామివారు చందనం పూత లోనే ఉంటారు దీనిని నిత్యరూపం అని పిలుస్తారు.

ఏడాదికి ఒక రోజు అక్షయ తృతీయ నాడు మాత్రం నిజ రూపంలో దర్శనమిస్తారు.

నిజరూపంలో స్వామివారు వరాహ ముఖంతో మానవ దేహం తో సింహపు తోకతో జూలుతో ఉంటాడు. కుడిచేతి వేళ్ళతో గరుత్మంతునికి అమృతం తాగిస్తూ ఎడమచేతితో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లుగా దర్శనమిస్తాడు.

స్వామి కిరువైపులా శ్రీదేవి భూదేవి కొలువై ఉన్నారు.

సింహాద్రి అప్పన్న ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఒక స్తంభం దర్శనమిస్తుంది దానికి కప్ప స్తంభం అని పేరు .

స్వామి వారిని దర్శించిన భక్తులు ఈ స్తంభాన్ని కౌగిలించుకోవడం ఇక్కడ ఆచారం .

ఆనాడు  శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుడుని  రక్షించటానికి వచ్చాడు .

"పవిత్రాణాయ సాధూనాం "సత్పురుషులను రక్షించటానికి వస్తానన్నాడు కృష్ణుని  వాగ్దానం ప్రకారం అవతారానికి ప్రధాన లక్ష్యం శిష్టరక్షణ  దాని అనుబంధ ప్రయోజనం దుష్టశిక్షణ.

Image 1

తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

Posted On 2026-05-12 16:38:01

Readmore >
Image 1

బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ మంత్రి పొన్నంను కలిసిన కాంగ్రెస్ నేతలు

Posted On 2026-05-12 16:37:06

Readmore >
Image 1

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్..

Posted On 2026-05-12 11:14:01

Readmore >
Image 1

బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్

Posted On 2026-05-12 06:24:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త

Posted On 2026-05-11 21:14:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

Posted On 2026-05-11 21:12:14

Readmore >
Image 1

నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు

Posted On 2026-05-11 21:02:02

Readmore >
Image 1

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి

Posted On 2026-05-11 20:55:26

Readmore >
Image 1

మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-05-11 20:42:59

Readmore >
Image 1

రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

Posted On 2026-05-11 20:38:54

Readmore >