Posted on 2026-04-18 10:19:45
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, లక్ష్మి అనే మహిళ భర్తతో కొన్నేళ్ల క్రితం గొడవ పడి విడిపోయింది. ఆమెకు సమీర (8) అనే కూతురు, శ్రావణ్ (5) అనే కొడుకు ఉన్నారు. గత ఆరు నెలలుగా నర్సింహులు అనే వ్యక్తితో లక్ష్మి సహజీవనం చేస్తోంది.
అయితే లక్ష్మి కుమారుడు శ్రావణ్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన నర్సింహులు, బాలుడిని హత్య చేయాలని ముందుగానే పథకం రచించినట్లు తెలుస్తోంది. ఇంట్లో లక్ష్మి లేని సమయంలో బాలుడి కళ్లలో కారం కొట్టి, గొంతు నులిమి, అనంతరం కర్రతో తలపై బాది నేలకేసి కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసి లక్ష్మి, నర్సింహులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన సమాజంలో పెరుగుతున్న నేరప్రవృత్తులపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసేలా చేసింది.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >