Posted on 2025-06-26 18:37:13
మత్తు పదార్థాలకు అలవాటు ఉంటే తల్లిదండ్రులే బాధ్యులే
స్కూల్లో కాలేజీలో విద్యార్థులను ఒక నిఘా ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు
భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల అధ్యక్షుడు మొ లుగు నాగేందర్ రెడ్డి విజ్ఞప్తి
డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట:అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాసాయిపేట మండల భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండలం అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ — "యువతే దేశ భవిష్యత్తుకు ఆయుధంగా నిలుస్తారు. అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్న దిశగా సాగాలి" అని మాట్లాడారు. అనంతరం
"ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు కలెక్టర్, ఇంజనీర్, లాయర్, డాక్టర్, ఒక అబ్దుల్ కలాం లాంటి అవాలనే కలలు, ఆశలు పెంచుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటారు. అలాంటి ఆశలను నిజం చేయాల్సిన బాధ్యత మన యువతపై ఉంది. మత్తు పదార్థాలకు అలవాటు పడి తల్లిదండ్రులకు శోకం మిగల్చే దిశగా వెళ్లకూడదు" అని అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, జూదం, బొమ్మ–బొరుసు ఆటలు మరియు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వలన యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వీటి నుండి తక్షణమే దూరంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, బిజెపి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు నాగేష్, బిజెపి బూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్, బిజెపి మాసాయిపేట దళిత ప్రజా ప్రతినిధి బూత్ అధ్యక్షుడు గౌరగళ్ల రాములు, బిజెపి నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >