Posted on 2025-06-26 18:36:02
పీ డీ ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ కుమార్
డైలీ భారత్, కర్నూల్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నియోజకవర్గంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూల్ నగరంలో డాక్టర్స్ కాలనీ నందు భాష్యం పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.
అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న భాష్యం పాఠశాలపై చర్యలు చూసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షుడు రమణ కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ ధనమే ధ్యేయంగా ఫీజుల దోపిడి చేస్తున్న భాష్యం పాఠశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాల్సినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు నేడు నగరంలో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తూ అడ్మిషన్లు చేసుకుంటూ నర్సరీ, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా పరీక్షల ఒత్తిడి తీసుకొస్తున్న భాష్యం పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలల్లో అంగట్లో సర్కుల్లాగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, టై లు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారని అన్నారు. కావున తక్షణమే విద్యాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో నాయకులు నగర అధ్యక్ష, కార్యదర్శులు దామోదర్, అస్లాం భాష, విష్ణు, రఘు, అజయ్, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >