Posted on 2025-06-21 21:25:32
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ సేవల కోసం ఒకే టోల్ఫ్రీ నంబర్ - 112ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇప్పటి వరకు పోలీస్ సహాయం (100), అంబులెన్స్ (108), మహిళల భద్రత (181).. బాలల హక్కుల పరిరక్షణ (1098), ప్రకృతి విపత్తుల (1077) వంటి విభిన్న సేవల కోసం వేర్వేరు నంబర్లను ప్రజలు ఉపయోగించేవారు.
అయితే ఇప్పుడు వీటి స్థానంలో ఒక్కటే నంబర్ - 112 కొనసాగనుంది. ఈ మార్పుతో అన్ని అత్యవసర సేవలకు వేగంగా.. సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి రాష్ట్రంలో 112 నంబర్ను యాక్టివ్ మోడ్లో అమలు చేస్తున్నామని తెలిపారు. 112 నంబర్కు ఫోన్ చేయగానే, కాల్ కేంద్రం లొకేషన్ను జీపీఎస్ ఆధారంగా ట్రాక్ చేసి.. సంబంధిత పోలీస్ స్టేషన్, అంబులెన్స్ లేదా ఫైర్ సర్వీసులకు సమాచారం పంపుతుంది.
అత్యవసర పరిస్థితుల్లో రిస్పాన్స్ టైమ్ను గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన మౌలిక వసతులు, టెక్నాలజీ టూల్స్తో వ్యవస్థను అప్గ్రేడ్ చేశారు. కాల్కు స్పందించడానికి ప్రత్యేకంగా ట్రెయిన్డ్ సిబ్బంది 24/7 విధులలో నియమితులయ్యారు. ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్ఫోన్లలో ప్యానిక్ బటన్ని నొక్కినట్లయితే వెంటనే 112కు కాల్ అవుతుందని స్పష్టం చేశారు. అలాగే 112 India Appను డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకున్నట్లయితే... ఒకే టచ్తో పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
మహిళల కోసం ప్రత్యేకంగా SOS ఫీచర్లు, ఫేక్ కాల్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీలు, కమ్యూనిటీ హాల్స్ లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా, పత్రికలు, టీవీ చానళ్లలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ అవగాహన వాహనాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >