Posted on 2025-06-21 19:08:00
డైలీ భారత్, జగద్గిరిగుట్ట: హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కింది పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జషిత్ చౌహాన్ (10) శుక్రవారం సాయంత్రం తన ఇంటికి సమీపంలో సైకిల్ తొక్కుతున్నాడు. ఆ క్రమంలో అనుకోకుండా కింద పడ్డాడు. అదే సమయానికి అటుగా ఓ స్కూల్ బస్సు వచ్చింది. అది మలుపు తిరిగే క్రమంలో ఆ బాలుడు బస్సు ముందు టైరు కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా, అవి ప్రస్తుతం వైరల్గా మారాయి.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >