Posted on 2025-06-19 19:24:03
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:తంగళ్లపల్లి మండలంలో అంకుషాపూర్ గ్రామనికి చెందిన మాజీ MPTC కరికవేణీ కుంటయ్య ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో పోలీసులు పట్టించుకోలేదనే అసత్య ప్రచారం జరుగుతుంది.తేదీ: 25.08.2023, కరికవేణీ కుంటయ్య గారు తనకు లేని భూమి రిజిస్ట్రేషన్ చేసాడు అని మల్యాల నాగరాజు పై తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా తంగళ్లపల్లి పోలీస్ వారు వెంటనే స్పందించి మల్యాల నాగరాజు పై Cr.No.278/2023 U/s 420, 384 r/w 511, 506 IPC కింద కేసు నమోదు చేశారు. అనంతరం తగిన సాక్ష్యాధారాలను సేకరించి, దర్యాప్తు పూర్తి చేసి,గౌరవ న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.తేదీ: 12-12-2024 రోజున మరో భూమి విషయంలో కరికవేణీ కుంటయ్య తనను మోసం చేసాడు అని గంగా కిష్ట రెడ్డి తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా తంగళ్లపల్లి పోలీస్ వారు Cr.No.427/2024 కింద కేసు నమోదు చేసి మరియు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జి షీట్ ఫైల్ చేయడం జరిగినది.
ఈ నేపథ్యంలో పోలీసులపై తప్పుడు ఆరోపణలు మరియు వదంతులు ప్రచారం చేస్తున్నారని అవి వాస్తవాలని పోలీసులు న్యాయబద్ధంగా మరియు నిష్పక్షపాతంగా స్పందించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక పోలీస్ వారు భూమి సంబంధిత అంశాలు మరియు సివిల్ వివాదాల్లో ఎటువంటి జోక్యం చేసుకోలేదు మరియు చట్టపరిధిలో విచారించారు అని తెలియచేయడం జరుగుతుంది.భూమి అంశాలు మరియు సివిల్ వివాదాల్లో ప్రజలు గౌరవ న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయండం జరుగుతుంది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >