Posted on 2025-06-17 21:53:52
బతికిపోయా అంటున్న భర్త
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్: ఎవరైనా పెళ్లి అయిన తర్వాత భార్య లవర్తో లేచిపోతే ఏం చేస్తారు. బాధతో ఏడుస్తారు. సిగ్గు, అవమానంతో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తన భార్య.. ఆమె ప్రియుడితో పారిపోయిందన్న బాధ లేనే లేదు. పైగా హమ్మయ్యా బతికిపోయా అంటూ చెబుతున్నాడు. ఎందుకంటే.. త్వరలోనే తాము హనీమూన్ వెళ్లాలని అనుకున్నామని.. ఒకవేళ హనీమూన్ వెళ్తే రాజా రఘువంశీలా తాను కూడా హత్యకు గురయ్యేవాడిని అంటూ పేర్కొన్నాడు. ఇక రెండు కుటుంబాలు రాజీకి రావడంతో కథ సుఖాంతమైంది.
ఎన్నో ఆశలు, కోరికలు, ఫ్యూచర్ ప్లాన్లతో పెళ్లిళ్లు చేసుకుంటే.. పట్టుమని పది రోజులు కూడా ఆ పెళ్లిళ్లు నిలబడటం లేదు. పెళ్లికి ముందే తమకు ఇష్టం లేదని వెళ్లిపోకుండా.. పెళ్లి అయిన తర్వాత లవర్స్తో పారిపోవడం, అందుకు అడ్డుగా ఉన్న భర్తను చంపేయడం గత కొన్ని రోజులుగా బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇటీవల మేఘాలయ హనీమూన్ మర్డర్ దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనీమూన్కు అని చెప్పి.. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి భర్తను చంపించి.. ఏమీ తెలియనట్లు భార్య చేసిన మాస్టర్ ప్లాన్ బయటికి రావడంతో దేశం మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఇక తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన యువతిని జార్ఖండ్కు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేయగా.. సరిగ్గా 10 రోజులకే భర్తకు పురుగుల మందు ఇచ్చి చంపేసి పరారైంది. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. అయితే ఇందులో ఆ భార్య.. భర్తను చంపకుండా వదిలేసి ప్రియుడితో పరారైంది. దీంతో తాను బతికి ఉన్నందుకు అదే 10 వేలు అనుకుంటూ ఆ భర్త సంతోషంగా ఉన్నాడు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >