Posted on 2025-06-17 09:05:10
డైలీ భారత్, హైదరాబాద్: భార్యలపాలిట యుముడిగా మారిన భర్తలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడంతా రివర్స్ అయ్యింది. భర్తల పాలిట యముడిగా మారుతున్నారు కొందరు భార్యలు. అక్రమసంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోనమ్ అనే యువతి పెళ్లైన నాలుగు రోజులకే భర్తను ప్రియుడి సాయంతో కిరాయి హంతకులను పెట్టి చంపించింది. అంతకు ముందు మీరట్ లో ముస్కాన్ కూడా తన భర్తను ప్రియుడి సాయంతో ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్ తో కప్పేసింది. ఇప్పుడు హైదరాబాద్ లో మరో ఘటన కలకలం రేపింది. ఆసిఫ్ నగర్ లో భర్తపై ప్రియుడుతో కలిసి దాడి చేసింది ఓ భార్య.
ఏడాదిక్రితం షైస్తాను అనే మహిళ ఓసామా ను వివాహం చేసుకుంది. ఆరు నెల క్రితం భర్త షైస్తాను దుబాయ్ కి పంపించింది. భర్తను దుబాయ్ కి పంపి షైస్తాను అమీర్ తో సహజీవనం చేస్తోంది. ఇటీవల తిరిగి వచ్చిన ఓసామాకు విషయం తెలియడంతో భార్యను నిలదీశాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించిన షైస్తాను సుపరి గ్యాంగ్ ను పెట్టుకొని భర్త ఓమాపై ప్రియుడుతో కలిసి దాడికి పాల్పడింది. ఈ దాడిలో భర్త ఒసామాకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >