Posted on 2025-06-15 21:49:43
డైలీ భారత్, వేములవాడ:ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో భద్రతా చర్యల భాగంగా పోలీస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్రిడ్జి నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని శాంతియుతంగా, అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు BNSS సెక్షన్ 163(3), సెక్షన్ 144 CrPC అమలులోకి తీసుకువచ్చారు.
ఈ మేరకు జూన్ 16, 2025 ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతల పనులు పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కూల్చివేతల ప్రాంతమైన ఆలయ ప్రాంగణం నుండి 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడటం పూర్తిగా నిషేధించబడినట్లు పేర్కొన్నారు.అధికారుల సూచన మేరకు ప్రజలు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరారు..
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >