Posted on 2025-06-15 18:02:11
డైలీ భారత్, కోరుట్ల: వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్ ఇద్దరు మరణించారు.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న గణేష్ విగ్రహాలు తయారు చేసే షెడ్లో క్రేన్ ద్వారా విగ్రహాలు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రేన్ చివరి భాగం ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లను తాకాయి. దీంతో మొత్తం తొమ్మిది మందికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా.. మరో ఏడుగురికి చికిత్స కొనసాగిస్తున్నారు..
#korutla #jagityala #ganesh #idols
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >