Posted on 2025-06-12 13:45:23
డైలీ భారత్, బీహార్: : నిర్లక్ష్యంగా, అతి వేగంగా కారు నడిపిన ఓ డ్రైవర్ ఓ ప్రాణం పోవడానికి కారణం అయ్యాడు. బిహార్ రాజధాని పట్నాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ కానిస్టేబుల్ మృతి చెందారు. శ్రీకృష్ణపురి ప్రాంతం సమీపంలోని అటల్ పాత్పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అటల్ పాత్పై వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఓ మహిళ కానిస్టేబుల్తో కూడిన బృందం ఒక కారును తనిఖీ చేస్తుండగా.. అతి వేగంగా వచ్చిన స్కార్పియో కారు.. పోలీసులు తనిఖీ చేస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
గాయపడిన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మహిళ కానిస్టేబుల్ మృతి చెందారు. మిగిత ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరార్ అయ్యాడు. వాహనంలో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >