Posted on 2025-06-07 11:23:56
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరులో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. దీంతో ఎస్ఐపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము, అతని అనుచరులు కల్లూరులోని తిరువూర్ క్రాస్ వద్ద ఉన్న ఓ హోటల్ కు వచ్చారు. అయితే టిఫిన్ చేసే విషయంలో హోటల్ నిర్వాహకులతో రాము వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఈ వివాదం కాస్తా పెద్దదిగా మారింది.
దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న కల్లూరు ఎస్ఐ హరిత.. పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరువర్గాలను ఆపాలని ప్రయత్నించారు. కానీ వారు ఆమె మాటలు లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాము ఎస్ఐపై దాడికి దిగాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాయల రాము సహా.. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >