| Daily భారత్
Logo




ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరుకోవాలి : సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు

News

Posted on 2023-12-11 14:38:55

Share: Share


ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరుకోవాలి : సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు

ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరుకోవాలి

సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు

రోడ్ సేఫ్టీపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ

డైలీ భారత్, సిరిసిల్ల : ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణంలోని శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ విద్యార్థులతో రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించిన, సిట్ బెల్ట్ పెట్టుకున్న వారికి విద్యార్థులు పువ్వులను అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ ఎక్కువ మంది అవగాహనా లోపం, అధిక వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ , ట్రిపుల్‌ డ్రైవింగ్‌ , ఓవర్‌ టేకింగ్‌ తదితర తప్పుల వల్ల ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదాల బారిన పడేసే అవకాశం ఉందని తెలిపారు. అందరికీ అర్థమయ్యేలా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆకునూరీ వెంకటేష్ తోపాటు ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >