Posted on 2025-06-05 17:31:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ అన్నారు.గురువారం జిల్లా న్యాయ సేవ సంస్థ మరియు రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ సంయుక్తంగా రంగారెడ్డి జిల్లా కోర్ట్ ఆవరణంలో ప్రపంచ పర్యావరణ దినోత్స్తవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్,జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ మైన, ఆహ్లాదరకమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడు కోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. భూ మండలంపై కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడ తాయన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జిలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కక్షిదారులు, ప్యారా లీగల్ వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >