Posted on 2025-05-29 17:34:00
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:గురువారం స్థానిక వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ఎస్సీఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జీవశాస్త్ర ఉపాధ్యాయులు వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకొని పాఠశాలలో పిల్లల యొక్క సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు. విద్యారంగంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన మెలకువలు నేర్చుకొని పాఠశాలలో సమర్థవంతంగా బోధనను నిర్వహించాలని సూచించారు పాఠశాలల్లో ఉన్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డులను సమర్ధవంతంగా ఉపయోగించడం అందరూ ఉపాధ్యాయులు నేర్చుకోవాలి వివిధ రకాల ఐ సి టి టూల్స్ను నేర్చుకొని పిల్లలకు నేర్పించాలని సూచించారు వెంకంపేట పాఠశాలలో జరుగుతున్న రెండవ దశ జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంను సెంటర్ ఇన్చార్జి జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. రిసోర్స్ పర్సన్లు రాష్ట్రస్థాయిలో మెలకువలను జిల్లాలోని అందరూ ఉపాధ్యాయులకు నేర్పాలని సూచించారు అనంతరం రెండోదశ శిక్షణా కార్యక్రమంలో ఉత్తమ పార్టిసిపెంట్స్ గా నిలిచిన పావని, రవీందర్, శ్రీలత మనోహర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య రిసోర్స్ పర్సన్లు వంగల తిరుపతిరెడ్డి ,ఎన్ భాస్కర్, దూస సంతోష్, యాద రవి మరియు వివిధ మండలాల జీవశాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >