Posted on 2025-05-29 17:34:00
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:గురువారం స్థానిక వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ఎస్సీఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జీవశాస్త్ర ఉపాధ్యాయులు వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకొని పాఠశాలలో పిల్లల యొక్క సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు. విద్యారంగంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన మెలకువలు నేర్చుకొని పాఠశాలలో సమర్థవంతంగా బోధనను నిర్వహించాలని సూచించారు పాఠశాలల్లో ఉన్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డులను సమర్ధవంతంగా ఉపయోగించడం అందరూ ఉపాధ్యాయులు నేర్చుకోవాలి వివిధ రకాల ఐ సి టి టూల్స్ను నేర్చుకొని పిల్లలకు నేర్పించాలని సూచించారు వెంకంపేట పాఠశాలలో జరుగుతున్న రెండవ దశ జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంను సెంటర్ ఇన్చార్జి జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. రిసోర్స్ పర్సన్లు రాష్ట్రస్థాయిలో మెలకువలను జిల్లాలోని అందరూ ఉపాధ్యాయులకు నేర్పాలని సూచించారు అనంతరం రెండోదశ శిక్షణా కార్యక్రమంలో ఉత్తమ పార్టిసిపెంట్స్ గా నిలిచిన పావని, రవీందర్, శ్రీలత మనోహర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య రిసోర్స్ పర్సన్లు వంగల తిరుపతిరెడ్డి ,ఎన్ భాస్కర్, దూస సంతోష్, యాద రవి మరియు వివిధ మండలాల జీవశాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >