| Daily భారత్
Logo




గ్రామపాలన అధికారుల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

News

Posted on 2025-05-24 14:31:26

Share: Share


గ్రామపాలన అధికారుల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

డైలీ భారత్, మహబూబాబాద్: ఈ నెల 25 ఆదివారం జరగబోయే గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే జి.పి.ఓ పరిక్ష  ఏర్పాట్లను రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మ చారీ తో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ....

పరీక్షా కేంద్రంలో  ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష  కేంద్రం దగ్గర లోని నోటీస్ బోర్డులో సీటింగ్ అమరికను పరిశీలించారు.  ఈ సీటింగ్ అమరిక,  తరగతి గదిలోని సీటింగ్ ఒకేలా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  కంప్యూటర్ గదిని పరిశీలించారు. ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, తదితర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిర్వహణ పై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడ   కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం  ఇవ్వకుండా చూడాలన్నారు. పక్కాగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిపించాలన్నారు. 

ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట డి.ఈ.ఓ డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, స్థానిక ఎం.ఆర్.ఓ  చంద్ర రాజేశ్వర్, పట్టణ సి.ఐ పి.దేవేందర్, సి.సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్,  ఈ.డి.యం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >