Posted on 2025-05-24 17:59:22
డైలీ భారత్, మహబూబాబాద్:శనివారం జిల్లా కలెక్టరేట్ లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్, మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ, పి. సి. పి.ఎన్.డి.టి ఆక్ట్ ల పై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఫిమేల్ లింగ నిష్పత్తి తక్కువగా ఉందని, అబార్షన్స్ రేట్ ఎక్కువగా ఉందని, ఎక్కడైతే ఫిమేల్ లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలలో ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, ఆరోగ్య సిబ్బంది ఎక్కడైనా ఏ హాస్పిటల్లో నైనా అబార్షన్స్ జరిగితే చెప్పాలని, ఎంటిపి ఆక్ట్ ప్రకారం వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు డాక్టర్ జగదీశ్వర్ పీడియాట్రిషన్, నగేష్, గవర్నమెంట్ ప్లీడర్, డాక్టర్.మీనాక్షి గైనకాలజిస్ట్, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ డాక్టర్ నాగవని , ఐసిడిఎస్ సూపర్వైజర్ వాహిని, కౌన్సిలర్ రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ వెంకటేష్, ఆరోగ్య విద్యా బోధకులు కేవీ రాజు, హెచ్ ఈ ఓ లోక్య, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, అరుణ్, మనోహర్ ఎల్. డి కంప్యూటర్స్, సిసి అనిల్ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు
ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు
Posted On 2026-03-04 14:16:32
Readmore >
ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
Posted On 2026-03-04 06:20:57
Readmore >