Posted on 2026-03-04 11:59:44
డైలీ భారత్, కోనరావుపేట: కోనరావుపేట మండలంలోని నిజామాబాద్లో బుధవారం ఉదయం ఉపాధి పనుల్లో భాగంగా సర్వాయి కాలువ మరమ్మతు పనులను చేపట్టారు. దాదాపు 10 మంది కూలీలు అక్కడ పనిచేస్తుండగా చెట్టుపై ఉన్న తేనె టీగలు వారిపై ఒక్కసారి దాడి చేశాయి. తేనె టీగలు మీదకు రావడంతో భయపడిపోయిన కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్పటికే వారిని తేనెటీగలు విపరీతంగా కుట్టాయి. ఇది గమనించిన తోటీ కూలీలు.. గాయపడిన వారిని కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. పైగా ప్రభుత్వ అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఇక చేసేదేమీ లేక.. గాయపడిన వారిని ట్రాలీ ఆటోలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి వెంట సర్పంచ్ సింగం శ్రీహరి, ఉపసర్పంచ్ లంబ రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్ వెళ్లారు. వారికి మెరుగైన వైద్యం అందిచేలా చూడాలని వైద్యులను కోరారు. కాగా, తేనేటీగల దాడిలో గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒక వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >