" /> ." /> ." />
Posted on 2026-03-04 08:42:33
డైలీ భారత్, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో మంగళవారం రాత్రి కారు అదుపుతప్పి బావిలో పడటంతో శ్రీనివాస్ (38) అనే యువకుడు మృతి చెందాడు. అత్యవసర పనిమీద రంగపేట్ వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొమ్ముతండా సమీపంలో రహదారి పక్కనే ఉన్న బావిలో కారు దూసుకెళ్లింది. మృతుడు కడం మండలంలోని "మన్ గ్రోమోర్" సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
Posted On 2026-03-04 06:20:57
Readmore >