| Daily భారత్
Logo




ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు

News

Posted on 2026-03-04 14:16:32

Share: Share


ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఉపాధి హామీ కూలీలకు ముఖ్య గమనిక. ఉపాధిహామీ పథకంలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో అక్రమాల జరగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల అమల్లోకి తెచ్చింది.ఇకపై ఉపాధిహామీ కూలీలకు ముఖ హాజరు (ఫేషియల్ అథెంటికేషన్)తప్పనిసరి చేసింది. మార్చి రెండో తేదీ నుంచి (సోమవారం) ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నూతన విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. గతంలో జాబ్ కార్డులో ఒకరి పేరు ఉంటే.. మరొకరు ఉపాధిహామీ పనులకు వెళ్లే పరిస్థితి ఉండేది. అలాగే మస్టర్‌లో దొంగ సంతకాలు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ-కేవైసీ విధానం తీసుకువచ్చింది. ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఉపాధిహామీ కూలీకి ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. ఈ కేవైసీ పూర్తి అయితే అక్రమాలకు పూర్తిగా స్వస్తి పలకవచ్చనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ తీసుకువచ్చింది. 2025 అక్టోబర్‌ నెలలో ఉపాధి హామీ కూలీలకు ఈకేవైసీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు మెజారిటీ కూలీలకు ఈ ప్రక్రియను పూర్తిచేశారు.మరోవైపు కొత్త విధానం ప్రకారం ఉపాధి హామీ పనికి వెళ్లిన సమయంలో పనులు చేసే ప్రదేశంలో కూలీలకు ఒక ఐడీని క్రియేట్ చేస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్, టీఏలు కూలీలకు మొదట ఫోటో తీస్తారు. పని పూర్తైన నాలుగు గంటల అనంతరం మరోసారి ఉపాధి హామీ కూలీల ఫోటోలు తీస్తారు. దీంతో పనులు పూర్తి చేసినట్లు సమాచారం అందుతుంది. వీటిలో ఏదీ మర్చిపోయినా ఉపాధి హామీ కూలీలకు బిల్లులు జమకావు. అయితే ఈ విధానం అమల్లో కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి.మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్‌ సిగ్నళ్లు సరిగా లేనటువంటి పరిస్థితి. దీంతో ఫేసియల్ రికగ్ని్షన్ విధానం అనేది కష్టతరంగా మారింది. అయితే పని ప్రదేశంలో ఉపాధిహామీ కూలీల ఫొటోలు తీయాలని.. ఆ తర్వాత సిగ్నల్‌ వచ్చే ప్రాంతానికి వెళ్లి యాప్‌లో అప్లోడ్‌ చేయాలని అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచిస్తున్నారు. ఉపాధిహామీ పథకం పనుల్లో పారదర్శకత కోసమే కొత్తగా ముఖ హాజరు విధానం తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ విధానంతో ఉపాధి కూలీలకు వేతనాలు సకాలంలో అందుతాయని.. అలాగే ఉపాధిహామీ పథకం సిబ్బందికి చాలా సమస్యలు తగ్గిపోతాయని చెప్తున్నారు.

Image 1

హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

Posted On 2026-06-02 20:47:41

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ

Posted On 2026-06-02 20:33:53

Readmore >
Image 1

అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Posted On 2026-06-02 18:31:15

Readmore >
Image 1

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 18:29:38

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

Posted On 2026-06-02 16:26:43

Readmore >
Image 1

బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

Posted On 2026-06-02 16:18:35

Readmore >
Image 1

కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘన నివాళులు..

Posted On 2026-06-02 16:13:35

Readmore >
Image 1

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

Posted On 2026-06-02 11:55:07

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ

Posted On 2026-06-02 11:54:03

Readmore >
Image 1

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

Posted On 2026-06-02 11:01:21

Readmore >