| Daily భారత్
Logo




విజయవాడలో బాంబు కలకలం‌

News

Posted on 2025-05-24 15:04:07

Share: Share


విజయవాడలో బాంబు కలకలం‌

బీసెంట్‌ రోడ్డు, రైల్వే స్టేషన్‌లో బాంబులు పెట్టామని బెదిరింపు కాల్స్

డైలీ భారత్, విజయవాడ: విజయవాడలో బాంబు బెదిరింపు కాల్స్‌ కలకలం రేపాయి. నగరంలోని రైల్వే స్టేషన్‌తో పాటు బీసెంట్‌ రోడ్డులో బాంబు పెట్టినట్లుగా కంట్రోల్‌ రూమ్‌కు వేర్వేరు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ముందుగా బీసెంట్ రోడ్డులోని ఎల్‌ఐసీ బిల్డింగ్‌లో బాంబు పెట్టినట్లుగా ఓ ఆగంతకుడు శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో విజయవాడ కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్‌ స్క్వాడ్‌తో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి బందర్‌ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు బీసెంట్‌ రోడ్డులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు కాల్‌ నేపథ్యంలో బీసెంట్‌ రోడ్డులోని అన్ని షాపులను మూసివేయించారు. సాధారణ ప్రజలు, వ్యాపారులు ఎవరూ ఈ రోడ్డులోకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీసెంట్‌ రోడ్డులోని షాపులు, తోపుడు బండ్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్‌ కాల్‌ అని తేలడంతో మధ్యాహ్నం నుంచి బీసెంట్‌ రోడ్డులో వ్యాపారాలకు అనుమతినిచ్చారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే విజయవాడ రైల్వే స్టేషన్‌కు కూడా బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన హుస్సేన్‌ అని పేరు చెప్పుకుంటూ హిందీలో ఫోన్‌ కాల్‌ మాట్లాడటంతో అప్రమత్తమైన జీఆర్‌పీ, సీఎస్‌డబ్ల్యూ, బాంబు స్క్వాడ్‌ బృందాలు రైల్వే స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎక్కడా అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్‌ కాల్‌ను ట్రేస్‌ చేసిన టెక్నికల్‌ టీమ్‌.. దాన్ని ఫేక్‌ కాల్‌గా నిర్ధారించారు.

Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >