Posted on 2026-03-03 21:31:53
అధికారులు, సిబ్బందితో కలిసి ఆనందాన్ని పంచుకున్న జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో హోలీ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు పూసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిరంతరం విధి నిర్వహణలో బిజీగా ఉండే సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపేలా ఎస్పీ స్వయంగా వారితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం ఈ వేడుకల్లో విశేషం.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత మరియు కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. వృత్తిరీత్యా ఎంతో ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీసు కుటుంబంలో ఇటువంటి వేడుకలు సభ్యుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను మరింత పటిష్టం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ఐపిఎస్, పిసిఆర్ సిఐ నరేష్, కామారెడ్డి టౌన్ ఎస్.హెచ్.ఓ నరహరి, సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, ఆర్.ఐ లు నవీన్ కుమార్, కృష్ణ మరియు జిల్లాలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
Posted On 2026-03-04 06:20:57
Readmore >