Posted on 2025-05-13 12:06:09
వ్యాపారుల నుండి 120 ఖాళీ బ్యాంక్ చెక్స్, 570 ప్రాంసరీ నోట్లు, 38 బాండ్లు స్వాధీనం
అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న ఆరుగురిపై కేసు నమోదు
ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి
డైలీ భారత్, ఖమ్మం: నిబంధనలకు విరుద్ధంగా చిటీలు, ఫైనాన్స్/ గిరిగిరి వ్యాపారం నిర్వహిస్తున్న పలువురి ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నగరంలో నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రవేటు చిట్స్, అధిక వడ్డీలతో ప్రజలను పీడిస్తున్న ఫైనాన్స్/ గిరిగిరి వ్యాపారుల ఇండ్లలో ఏకకాలంలో 11 చోట్ల దాడులు నిర్వహించి తనిఖీలు చేసినట్లు తెలిపారు లక్షల విలువ చేసే 120 ఖాళీ బ్యాంక్ చెక్స్, 570 ప్రాంసరీ నోట్లు, 38 బాండ్లు లభ్యమయ్యాయినట్లు తెలిపారు. చిట్ నిర్వహుకులు తమ కస్టమర్ల నుండి సేకరించిన డబ్బును చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం, దౌర్జన్యాలు, దాడులు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న చిట్స్, ఫైనాన్స్ వ్యాపారుల ఇండ్లలో తనిఖీ చేసి ఆరుగురిలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అధిక వడ్డీ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >