Posted on 2025-05-12 21:59:28
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : భూ భారతి తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.సోమవారం కొందుర్గ్ మండలంలోని అగిర్యాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తో రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి రద్దు చేసి భూభారతితో అర్హులైన రైతులకు భూములపై హక్కులు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. రెవెన్యూ సదస్సు లో భూ సమస్య ఉంటే దరఖాస్తులు సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, కొందూర్గ్ మండల అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,మాజీ ఎంపీటీసీలు అంజి రెడ్డి,మల్లేష్ గౌడ్,నాయకులు సీతారాం ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >