Posted on 2025-05-12 21:59:28
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : భూ భారతి తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.సోమవారం కొందుర్గ్ మండలంలోని అగిర్యాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తో రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి రద్దు చేసి భూభారతితో అర్హులైన రైతులకు భూములపై హక్కులు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. రెవెన్యూ సదస్సు లో భూ సమస్య ఉంటే దరఖాస్తులు సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, కొందూర్గ్ మండల అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,మాజీ ఎంపీటీసీలు అంజి రెడ్డి,మల్లేష్ గౌడ్,నాయకులు సీతారాం ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >