Posted on 2025-05-12 18:29:28
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : భూ భారతి తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.సోమవారం కొందుర్గ్ మండలంలోని అగిర్యాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తో రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి రద్దు చేసి భూభారతితో అర్హులైన రైతులకు భూములపై హక్కులు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. రెవెన్యూ సదస్సు లో భూ సమస్య ఉంటే దరఖాస్తులు సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, కొందూర్గ్ మండల అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,మాజీ ఎంపీటీసీలు అంజి రెడ్డి,మల్లేష్ గౌడ్,నాయకులు సీతారాం ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >