| Daily భారత్
Logo




ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

News

Posted on 2025-05-08 09:02:43

Share: Share


ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

డైలీ భారత్, కరీంనగర్: ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏడేళ్లు  ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఏడేళ్లు  ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ వ్యవహారం నడిపించింది వరలక్ష్మి అనే యువతి. అయితే ఇటీవల ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెందిన ఎల్లేష్..  సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.తన ఫోన్ లో కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని.. యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని, యువతి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని చనిపోయే ముందు తన తల్లిదండ్రులను కోరాడు ఎల్లేష్.

ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ గణేశ్ నగర్ కు చెందిన వరలక్ష్మి అమ్మాయిని ఏడేళ్ళుగా ప్రేమించానని.. ఆమె పూర్తి అడ్రస్ కనుక్కోండి అంటూ తన తల్లిదండ్రులకు ఎల్లేష్ చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి వరలక్ష్మీతో పాటుగా ఆమె తల్లి కూడా కారణమని వారిని వదిలి పెట్టవద్దని కోరాడు. తాను జాబ్ చేయడం లేదని తనను కాదని మరో అబ్బాయికిచ్చి పెళ్లి చేశారని వాపోయాడు.  వరలక్ష్మికి ఫోన్ కొనిచ్చానని..  ఓ సారి ప్రెగ్నెన్సీ అయితే తీయించానని ఇప్పుడు తనని కాదని వాళ్ల బావని పెళ్లిని చేసుకుందని ఎల్లేష్ చెప్పుకొచ్చాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Image 1

జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి

Posted On 2026-03-06 23:26:12

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి

Posted On 2026-03-06 23:23:50

Readmore >
Image 1

శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం

Posted On 2026-03-06 23:21:29

Readmore >
Image 1

కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు

Posted On 2026-03-06 23:19:11

Readmore >
Image 1

విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు

Posted On 2026-03-06 20:44:04

Readmore >
Image 1

మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి

Posted On 2026-03-06 20:36:31

Readmore >
Image 1

భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు

Posted On 2026-03-06 20:11:17

Readmore >
Image 1

నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Posted On 2026-03-06 20:09:42

Readmore >
Image 1

TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ

Posted On 2026-03-06 20:04:50

Readmore >
Image 1

ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించుకోవాలి

Posted On 2026-03-06 19:58:51

Readmore >