| Daily భారత్
Logo




బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్

News

Posted on 2025-04-19 18:21:12

Share: Share


బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని పాల్వంచ లో గల జిల్లా కలెక్టరేట్  విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది, 

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చమ బెంగాల్ రాష్ట్రంలో హిందువుల పై జరుగుతున్న అమానుష దాడులకు నిరసన గా విశ్వహిందూ పరిషత్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది, ఈ సందర్భంగా బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలనీ, హిందువులపై దాడులకు తెగబడుతున్న జీహాదీ మూకలను వెంటనే అరెస్టు చెయ్యాలనీ, బెంగాల్ లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు డిమాండ్ చేశారు,బెంగాల్ హింస విషయమై విశ్వహిందూ పరిషత్ డిమాండ్లతో కూడిన మెమోరాండం ను కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి కి పంపిస్తూ కలెక్టర్ కార్యాలయం A.O  అందించడం జరిగింది, ఈ సందర్భంగా ధర్నాలో ముఖ్య అథిదిగా పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్  మాట్లాడుతూ, హిందువులపై దాడులు చేస్తున్న జీహాదీలపై కఠిన చర్యలు తీసుకుని, బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధిచాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు , జిల్లా ఉపాధ్యక్షులు దారా రమేష్ , జిల్లా కార్యదర్శి శ్రీమతి గంగాధరి సీత , జిల్లా సంఘటన కార్యదర్శి చిట్టెంశెట్టి లక్ష్మయ్య , జిల్లా బజరంగ్దళ్ సహ సంయోజక్ కూసన సాగర్ , బజరంగ్దళ్ జిల్లా సాప్తాహిక్ మిలన్ ప్రముఖ్ శ్రీరామోజు మధుసూదన చారి , జిల్లా ధర్మప్రసార్ ప్రముఖ్ రాయలచందర్ రావు , జిల్లా న్యాయ సలహా ప్రముఖ్ అడ్వకేట్ మురళీ , పాల్వంచ ప్రఖండ కార్యదర్శి భూక్యా మోహన్ , పాల్వంచ ప్రఖండ సహ కార్యదర్శి దాసరి మాధవరావు , పాల్వంచ ప్రఖండ మాతృశక్తి సంయోజిక మందా వెంకటరమణ , పాల్వంచ ప్రఖండ బజరంగ్దళ్ సహ సంయోజక్ నిమ్మల వరణ్, పాల్వంచ ప్రఖండ బజరంగ్దళ్ గోరక్షా ప్రముఖ్ నూకల సతీష్ కుమార్ , భద్రాచలం ప్రఖండ అధ్యక్షులు తిరుపతిరావు , భద్రాచలం ప్రఖండ కార్యదర్శి కొమర్రాజు నాగేశ్వరావు ,  భద్రాచలం ప్రఖండ సహ కార్యదర్శి మణికంఠేశ్వార్, అశ్వాపురం మండల ధర్మరక్షక్ సిహెచ్ నరేష్, అశ్వారావుపేట మండల అధ్యక్షులు సీమకుర్తి సుబ్బారావు , చుంచుపల్లి ప్రఖండ బజరంగ్దళ్ విద్యార్థి ప్రముఖ్ మోక్ష, ఇల్లందు పట్టణ బజరంగ్దళ్ సంయోజక్ శివం, పాత పాల్వంచ బజరంగ్దళ్ కార్యకర్త ప్రవీణ్ మరియు మరికొందరు పాల్వంచ బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >