| Daily భారత్
Logo




బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్

News

Posted on 2025-04-19 21:51:12

Share: Share


బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని పాల్వంచ లో గల జిల్లా కలెక్టరేట్  విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది, 

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చమ బెంగాల్ రాష్ట్రంలో హిందువుల పై జరుగుతున్న అమానుష దాడులకు నిరసన గా విశ్వహిందూ పరిషత్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది, ఈ సందర్భంగా బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలనీ, హిందువులపై దాడులకు తెగబడుతున్న జీహాదీ మూకలను వెంటనే అరెస్టు చెయ్యాలనీ, బెంగాల్ లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు డిమాండ్ చేశారు,బెంగాల్ హింస విషయమై విశ్వహిందూ పరిషత్ డిమాండ్లతో కూడిన మెమోరాండం ను కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి కి పంపిస్తూ కలెక్టర్ కార్యాలయం A.O  అందించడం జరిగింది, ఈ సందర్భంగా ధర్నాలో ముఖ్య అథిదిగా పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్  మాట్లాడుతూ, హిందువులపై దాడులు చేస్తున్న జీహాదీలపై కఠిన చర్యలు తీసుకుని, బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధిచాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు , జిల్లా ఉపాధ్యక్షులు దారా రమేష్ , జిల్లా కార్యదర్శి శ్రీమతి గంగాధరి సీత , జిల్లా సంఘటన కార్యదర్శి చిట్టెంశెట్టి లక్ష్మయ్య , జిల్లా బజరంగ్దళ్ సహ సంయోజక్ కూసన సాగర్ , బజరంగ్దళ్ జిల్లా సాప్తాహిక్ మిలన్ ప్రముఖ్ శ్రీరామోజు మధుసూదన చారి , జిల్లా ధర్మప్రసార్ ప్రముఖ్ రాయలచందర్ రావు , జిల్లా న్యాయ సలహా ప్రముఖ్ అడ్వకేట్ మురళీ , పాల్వంచ ప్రఖండ కార్యదర్శి భూక్యా మోహన్ , పాల్వంచ ప్రఖండ సహ కార్యదర్శి దాసరి మాధవరావు , పాల్వంచ ప్రఖండ మాతృశక్తి సంయోజిక మందా వెంకటరమణ , పాల్వంచ ప్రఖండ బజరంగ్దళ్ సహ సంయోజక్ నిమ్మల వరణ్, పాల్వంచ ప్రఖండ బజరంగ్దళ్ గోరక్షా ప్రముఖ్ నూకల సతీష్ కుమార్ , భద్రాచలం ప్రఖండ అధ్యక్షులు తిరుపతిరావు , భద్రాచలం ప్రఖండ కార్యదర్శి కొమర్రాజు నాగేశ్వరావు ,  భద్రాచలం ప్రఖండ సహ కార్యదర్శి మణికంఠేశ్వార్, అశ్వాపురం మండల ధర్మరక్షక్ సిహెచ్ నరేష్, అశ్వారావుపేట మండల అధ్యక్షులు సీమకుర్తి సుబ్బారావు , చుంచుపల్లి ప్రఖండ బజరంగ్దళ్ విద్యార్థి ప్రముఖ్ మోక్ష, ఇల్లందు పట్టణ బజరంగ్దళ్ సంయోజక్ శివం, పాత పాల్వంచ బజరంగ్దళ్ కార్యకర్త ప్రవీణ్ మరియు మరికొందరు పాల్వంచ బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Image 1

వాట్సాప్ ద్వారా వైద్య సేవలు.. త్వరలో అందుబాటులోకి!

Posted On 2026-03-12 07:13:00

Readmore >
Image 1

త్వరలో మహిళలకు డిజిటల్ డిజిటల్ హెల్త్ కార్డ్

Posted On 2026-03-12 07:06:57

Readmore >
Image 1

తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు జీవో విడుదల

Posted On 2026-03-12 07:06:09

Readmore >
Image 1

MRO పై అరెస్ట్ వారెంట్ జారీ

Posted On 2026-03-12 07:05:19

Readmore >
Image 1

ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించే నెపంతో ఇళ్లలో చోరీలు

Posted On 2026-03-11 22:05:47

Readmore >
Image 1

విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి

Posted On 2026-03-11 20:27:35

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం

Posted On 2026-03-11 20:23:40

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకు

Posted On 2026-03-11 20:19:53

Readmore >
Image 1

కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

Posted On 2026-03-11 19:25:18

Readmore >
Image 1

తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

Posted On 2026-03-11 18:51:35

Readmore >