Posted on 2025-03-23 07:37:35
ప్రపంచ నీటి దినోత్సవం
•సాంప్రదాయ వనరులను సంరక్షించుకోవాలి
•దాన్ ఫౌండేషన్ ఐటిసి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా; కొత్తగూడెం విద్యానగర్ కాలనీ లో హనుమాన్ సదన్ ఫంక్షన్ హాల్ నందు ధాన్ ఫౌండేషన్ నిర్వహణలో (ఐటిసి) ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి వి బాబురావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం కృషి విజ్ఞాన కేంద్రం (కె.వి.కె) ప్రోగ్రాం అధికారి వి లక్ష్మీనారాయణమ్మ మరియు డాన్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ ఎన్ వినయ్ కుమార్ పాల్గొనడం జరిగింది
వినయ్ కుమార్ మాట్లాడుతూ ఐటిసి ధాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం ఏడు మండలాలలో సుమారు 12 వందలకు పైగా నీటి కుంటలను తవ్వించడం జరిగినది వాటిద్వారా సుమారు గా వర్షపు నీటిని పది కోట్ల లీటర్ల నీటిని వడిచిపెట్టడం జరిగింది జలాలను కాలుష్యం కాకుండా సంరక్షించుకోవాలి ఉపరితల జలాలను రక్షించుకుంటూ పొదుపుగా వాడుకోవాలి ఇంకుడు గుంటలు తవ్వి జల సంరక్షణ చేసుకోవాలి వర్షపు నీటి సంరక్షణకై నిర్మాణాలు చేపట్టి మొక్కలను పెంచుతూ పచ్చదనాన్ని పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షిస్తూ భావితరాల భవిష్యత్ కోసం నీటిని పొదుపు చేయాలి సాంప్రదాయ వనరులైన చెరువులు కుంటలు చెక్ డాములు బోరు బావులు మొదలైన వాటిని రక్షించుకోవాలి తరువాత కె వి కె. లక్ష్మీనారాయణమ్మ మాట్లాడుతూ నీటిని సంరక్షించ వలసింది పోయి వృధా చేస్తున్నారని వరిలో దాదాపు ఎక్కువ నీటిని వినియోగించి పండిస్తున్నారని ఆ రకంగా పండించడం వల్ల నీటి వృధా అవ్వడమే కాక రాబోయే తరాలకు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పడం జరిగింది టెక్నాలజీ ఎంత పెరిగిన దానిని వినియోగించుకుని రైతులు అధిక దిగుబడులు సాధించుటకు ప్రయత్నించట్లేదని చెప్పడం జరిగింది తక్కువ నీటితో వరిని పండించుటకు ప్రయత్నాలు చేయాలని చెప్పారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి వి బాబురావు మాట్లాడుతూ బోరు బావి ఉన్న ప్రతి రైతు చేలోను ఇండ్లలోను ఇంకుడు గుంతలు తవించుకోవాలని చేలో తీసిన ఇంకుడు గుంతల కట్టల మీద మునగ చెట్లు పెంచుకోవడం వల్ల ఆదాయం వస్తుందని అదే ఇంకుడు గుంటలో చేపలు వేసుకోవడం వల్ల ఆదాయం సమకూర్చుకోవచ్చని ఇది ప్రతి రైతు పాటించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ధాన్ ఫౌండేషన్ సిబ్బంది రైతులు మహిళలు వయలగా సంఘం లీడర్లు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >