Posted on 2026-05-02 19:49:44
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడిముంజ గ్రామంలో ఇటీవల జరిగిన వాహన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, వేములవాడ ప్రాంతంలో జరుగుతున్న వాహన చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు గస్తీ మరియు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను వాహన చోరీలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు.
నిందితుని వివరాలు:
దామ పవన్ అలియాస్ పవన్ కళ్యాణ్, నివాసం: గోదావరిఖని.
నిందితుడి వద్ద నుండి మొత్తం 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనిని రిమాండ్కు తరలించింది.
ఈ కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ రామ్మోహన్, పీసీ తిరుపతి, పీసీ ఇమ్రాన్లను సీఐ వీర ప్రసాద్ గారు అభినందించారు.
వేములవాడ టౌన్ పోలీసులు
ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో నిల్వ ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సిరిసిల్ల పెద్ద బజార్లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
Posted On 2026-07-30 08:32:38
Readmore >
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >