Posted on 2025-03-23 07:35:12
మద్దతు తెలిపిన మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం లోని గంగా హుస్సేన్ బస్తీలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల. రవీందర్ సందర్శించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విలేకరులకు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలు ఉద్దేశించి మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల. రవీందర్ మాట్లాడుతూ విలేకరులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులని ప్రభుత్వాలు నిలబడాలన్న సింహభాగం వారిదేనని గౌరవాన్ని అగవరపరచవద్దని జర్నలిస్టులందరూ బడుగు బలహీన వర్గాల వారిని గౌరవంగా బతకడానికి తగిన స్థలం జిల్లా కేంద్రంలో వారికి కేటాయించి ఇల్లులు కూడా నిర్మించి వేయాలని డిమాండ్ చేయడం జరిగింది. వారి న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని లేనిపక్షంలో విలేకరులు చేసేటువంటి ఎటువంటి ఉద్యమానికి అయినా మాల మహానాడు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విలేకరులు మరియు మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు కొప్పరి. నవతన్, ఆనంద్ రావు మహేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
Posted On 2026-03-10 20:55:00
Readmore >
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్
Posted On 2026-03-10 20:28:52
Readmore >
సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి మృతి పట్ల షబ్బీర్ అలీ సంతాపం
Posted On 2026-03-10 18:48:11
Readmore >
ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి
Posted On 2026-03-10 18:22:28
Readmore >