| Daily భారత్
Logo




లిఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా ప్రవేట్ హాస్పటల్‌లో మహిళ మృతి

News

Posted on 2025-03-22 09:24:50

Share: Share


లిఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా ప్రవేట్ హాస్పటల్‌లో మహిళ మృతి

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనమారి కృష్ణపురానికి చెందిన సత్తు సరోజిని (55) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రసూన ఆర్థోపెడిక్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. శస్త్రచికిత్స తర్వాత ఆ మహిళను స్ట్రెచర్‌పై లిఫ్ట్‌లోకి తరలించారు. రోగి, ఇద్దరు వార్డు బాలురు లిఫ్ట్‌లోకి ప్రవేశించగానే, సాంకేతిక లోపం కారణంగా తలుపులు మూసేలోపు అది కదిలింది. స్ట్రెచర్ లిఫ్ట్ తలుపులలో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ మూడవ అంతస్తుకు వెళ్లి, ఆపై గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మహిళ అక్కడికక్కడే మరణించింది.

మీది అంతస్తుకు వెళ్లాల్సిన లిఫ్ట్‌ సాంకేతిక సమస్య కారణంగా ఆకస్మాత్తుగా, అతివేగంగా కిందికి పడిపోయి నేలకు ఢీకొట్టడంతో అందులోని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. లిఫ్టులో స్ట్రెచర్‌పై ఉన్న ఆమె దానిపైనే కన్నుమూసింది. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న ప్రసూన ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సట్టు సరోజిని(63)కి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ఈ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు యాంజియోగ్రామ్‌ నిర్వహించి ఇంటికి పంపించారు. తిరిగి శుక్రవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన సరోజినికి మళ్లీ పరీక్షలు నిర్వహించి స్టంట్‌ వేయాలని చెప్పారు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో విజయవంతంగా స్టంట్‌ వేశారు.

ఆపరేషన్‌ అనంతరం ఆమెను థియేటర్‌ ఉన్న రెండో అంతస్తు నుంచి ఐసీయూ వార్డు (నాలుగో అంతస్తు)కి తరలించేందుకు స్ట్రెచర్‌పై పడుకోబెట్టి లిఫ్ట్‌లోకి తీసుకువచ్చారు. ఆమె వెంట ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. లిఫ్ట్‌లో బటన్‌ను నొక్కగానే పైకి వెళ్లడానికి బదులు, ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండో ఫ్లోర్‌ నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు పడిపోయింది. దీంతో స్ట్రెచర్‌పె ఉన్న సరోజిని లిఫ్ట్‌లోనే ప్రాణం విడిచింది. ఆమెతో పాటు ఉన్న ఆస్పత్రి సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. లిఫ్ట్‌ సెన్సర్లు పనిచేయక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఈ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈనెల 7నే తగిన మరమ్మతులు చేయించినట్లు ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. అయినప్పటికీ ప్రమాదం ఎలా జరిగిందనేది అంతుబట్టడం లేదు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సరోజిని మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు, కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు.

Image 1

షాబాద్ ఉప సర్పంచ్ గా దండు రాహుల్ గుప్త

Posted On 2025-12-14 20:43:09

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో వినూత్న తీర్పు ఇచ్చిన ఓటర్లు

Posted On 2025-12-14 20:40:04

Readmore >
Image 1

మల్లారెడ్డి గూడ సర్పంచ్‌గా సబిత గోవర్ధన్ రెడ్డి విజయం

Posted On 2025-12-14 19:42:43

Readmore >
Image 1

సర్దార్ నగర్ సర్పంచ్‌గా మామిడి కీర్తి హరీష్ విజయం

Posted On 2025-12-14 19:41:34

Readmore >
Image 1

షాబాద్ సర్పంచ్‌గా గుండాల అశోక్ విజయం

Posted On 2025-12-14 19:40:19

Readmore >
Image 1

అప్పిరెడ్డిగూడ సర్పంచ్‌గా పోలేపల్లి సందీప్ గౌడ్ విజయం

Posted On 2025-12-14 18:21:12

Readmore >
Image 1

సంకేపల్లిగూడ సర్పంచ్‌గా కుమ్మరి లావణ్య చెన్నయ్య విజయం

Posted On 2025-12-14 18:20:00

Readmore >
Image 1

వల్లభాపూర్ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెరుమళ్ళ గంగయ్య గెలుపు

Posted On 2025-12-14 18:15:57

Readmore >
Image 1

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బోనీ కొట్టిన కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బస్సి సునీత

Posted On 2025-12-14 17:52:51

Readmore >
Image 1

విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై వీరంగం సృష్టించిన మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్

Posted On 2025-12-14 14:54:09

Readmore >