| Daily భారత్
Logo




లిఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా ప్రవేట్ హాస్పటల్‌లో మహిళ మృతి

News

Posted on 2025-03-22 09:24:50

Share: Share


లిఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా ప్రవేట్ హాస్పటల్‌లో మహిళ మృతి

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనమారి కృష్ణపురానికి చెందిన సత్తు సరోజిని (55) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రసూన ఆర్థోపెడిక్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. శస్త్రచికిత్స తర్వాత ఆ మహిళను స్ట్రెచర్‌పై లిఫ్ట్‌లోకి తరలించారు. రోగి, ఇద్దరు వార్డు బాలురు లిఫ్ట్‌లోకి ప్రవేశించగానే, సాంకేతిక లోపం కారణంగా తలుపులు మూసేలోపు అది కదిలింది. స్ట్రెచర్ లిఫ్ట్ తలుపులలో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ మూడవ అంతస్తుకు వెళ్లి, ఆపై గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మహిళ అక్కడికక్కడే మరణించింది.

మీది అంతస్తుకు వెళ్లాల్సిన లిఫ్ట్‌ సాంకేతిక సమస్య కారణంగా ఆకస్మాత్తుగా, అతివేగంగా కిందికి పడిపోయి నేలకు ఢీకొట్టడంతో అందులోని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. లిఫ్టులో స్ట్రెచర్‌పై ఉన్న ఆమె దానిపైనే కన్నుమూసింది. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న ప్రసూన ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సట్టు సరోజిని(63)కి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ఈ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు యాంజియోగ్రామ్‌ నిర్వహించి ఇంటికి పంపించారు. తిరిగి శుక్రవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన సరోజినికి మళ్లీ పరీక్షలు నిర్వహించి స్టంట్‌ వేయాలని చెప్పారు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో విజయవంతంగా స్టంట్‌ వేశారు.

ఆపరేషన్‌ అనంతరం ఆమెను థియేటర్‌ ఉన్న రెండో అంతస్తు నుంచి ఐసీయూ వార్డు (నాలుగో అంతస్తు)కి తరలించేందుకు స్ట్రెచర్‌పై పడుకోబెట్టి లిఫ్ట్‌లోకి తీసుకువచ్చారు. ఆమె వెంట ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. లిఫ్ట్‌లో బటన్‌ను నొక్కగానే పైకి వెళ్లడానికి బదులు, ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండో ఫ్లోర్‌ నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు పడిపోయింది. దీంతో స్ట్రెచర్‌పె ఉన్న సరోజిని లిఫ్ట్‌లోనే ప్రాణం విడిచింది. ఆమెతో పాటు ఉన్న ఆస్పత్రి సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. లిఫ్ట్‌ సెన్సర్లు పనిచేయక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఈ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈనెల 7నే తగిన మరమ్మతులు చేయించినట్లు ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. అయినప్పటికీ ప్రమాదం ఎలా జరిగిందనేది అంతుబట్టడం లేదు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సరోజిని మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు, కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు.

Image 1

రోడ్ సేఫ్టీ ఛాంపియన్ షిప్

Posted On 2026-03-11 09:28:55

Readmore >
Image 1

మోడల్ హౌసింగ్ కాలనీ మౌళిక సదుపాయాలకు గాను 20 కోట్లు మంజూరు

Posted On 2026-03-11 08:18:13

Readmore >
Image 1

సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ

Posted On 2026-03-10 20:55:00

Readmore >
Image 1

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్

Posted On 2026-03-10 20:28:52

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్

Posted On 2026-03-10 19:55:08

Readmore >
Image 1

సావిత్రిబాయి పూలే 129 వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు

Posted On 2026-03-10 19:34:32

Readmore >
Image 1

స్కూలుకు "తాళం"... విద్యార్థుల "ఆక్రందన"

Posted On 2026-03-10 19:26:04

Readmore >
Image 1

సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి మృతి పట్ల షబ్బీర్ అలీ సంతాపం

Posted On 2026-03-10 18:48:11

Readmore >
Image 1

ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి

Posted On 2026-03-10 18:22:28

Readmore >
Image 1

జిల్లా సంఘం ఆధ్వర్యంలో మున్నూరుకాపు కౌన్సిలర్లకు సన్మానం

Posted On 2026-03-10 18:10:43

Readmore >