Posted on 2025-02-15 14:48:07
డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తాతా మధు,మాజీ ఎమ్మెల్యేలు బానోతు మదన్ లాల్, హరిప్రియ నాయక్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిండిగాల రాజేందర్,లింగాల కమల్ రాజ్,గుండాల కృష్ణ (ఆర్జేసీ), బమ్మెర రాంమూర్తి, బెల్లం వేణు తదితరులతో కలసి ఖమ్మం జిల్లా దానవాయిగూడెం కారాగారంలో ఉన్న పార్టీ ప్రముఖుడు లక్కినేని సురేందర్ ను పరామర్శించి తమ సంఘీభావం తెలిపారు.అధికార పార్టీ నాయకుల వత్తిళ్లకు పోలీసులు తలొగ్గి సురేందర్ పై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీలు కవిత,మధు, మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, హరిప్రియ, పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్,కమల్ రాజ్,ఆర్జేసీ, రాంమూర్తి,వేణు తదితరులు జైలులో శనివారం సురేందర్ ను కలిసి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు,తమ సంఘీభావం ప్రకటించారు. అధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో ఉండాలని పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీలు కవిత,మధు తదితర ప్రముఖులు సురేందర్ కు భరోసానిచ్చారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >